Saturday, April 27, 2024

తెలంగాణలో మృత్యుంజయ హోమాలు.. మోదీ కోసం బీజేపీ నేతల సంకల్పం

తెలంగాణవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో నేడు మృత్యుంజయ హోమాలు జరగనున్నాయి. ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్దిల్లాలని బీజేపీ నేతలు మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో ఉదయం 11 గంటలకు అల్కాపురిలోని శృంగేరి మఠం ఆలయంలో మృత్యుంజయ హోమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ హోమాలు నిర్వహించనున్నారు. అనంతరం బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొననున్నారు.

ఇటీవ‌ల పంజాబ్‌లో ప్ర‌ధాని మోదీ కాన్వాయ్‌ని అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భ‌ద్ర‌తా వైఫ‌ల్యంపై దేశవ్యాప్తంగా చ‌ర్చ మొద‌లైంది. దీంతో మోదీ కోసం మృత్యుంజ‌య హోమాలు నిర్వహించాల‌ని బీజేపీ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌.. జిల్లా, మండల స్థాయి నేతలకు పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement