Friday, April 26, 2024

Breaking: రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. గిల్‌, పుజారా అవుట్!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమవడంతో ఓపెనర్ అవతారం ఎత్తిన ఛటేశ్వర్ పుజారా (13) నిరాశ పరిచాడు. ఆరంభంలోనే గిల్ అవుటవడంతో క్రీజులోకి వచ్చిన విహారితో కలిసి మరో వికెట్ పడకుండా కాసేపు జాగ్రత్తగా ఆడిన పుజారా.. ఆండర్సన్ వేసిన 18వ ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చేరాడు. కాగా.. ఆండర్సన్ వేసిన బంతిని పుజారా సరిగా అంచనా వేయలేకపోయాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి సెకండ్ స్లిప్స్‌లో ఉన్న క్రాలీ వైపు వెళ్లింది. అతను మిస్ చేయకుండా క్యాచ్ అందుకోవడంతో పుజారా పెవిలియన్ చేరాడు. 46 పరుగుల వద్ద భారత్ రెండు వికెట్లు కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement