Friday, May 3, 2024

టీ 20 ప్రపంచకప్‌.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

టీ 20 ప్రపంచకప్‌లో రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య కాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట భారత్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. ఇంగ్లాండ్‌తో సెమీస్‌ మ్యాచ్‌ కఠినంగానే ఉంటుంది. టీమిండియా జట్టు ఇంగ్లాండ్‌తో నువ్వా నేనా అన్నట్లు బరిలో దిగనుంది. బలమైన ఇంగ్లాండ్‌ను ఢీకొట్టి ఫైనల్‌కు రావడం అంత సులభమేమి కాదు. సూపర్‌ 12లో అద్భుత ప్రతిభ కనబరిచిన టీమిండియా జట్టు ఫైనల్‌ బెర్తు కోసం పోరాటం చేస్తోంది. మరో వైపు లీగ్‌ దశలో మెరుగైన ప్రదర్శన కనబర్చడంలో విఫలమైన ఇంగ్లాండ్‌ సెమీస్‌లో స్థాయికి తగ్గట్టు రాణించాలని భావిస్తోంది. అయితే ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement