Saturday, April 27, 2024

కరోనా బాధితులకు అందని పరిహారం.. ఏపీపై సుప్రీం కోర్టు ఆగ్రహం

కరోనా బాధితుల బంధువులకు పరిహారం ఇవ్వని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హాజరుకావాలంటూ ఆదేశాలిచ్చింది. అలాగే బీహార్ ప్రభుత్వంపై కూడా ధర్మాసనం సీరియస్ అయింది..

కోవిడ్ బాధితుల పరిహారన్ని వారి బంధువులకు ఏపీ, బీహార్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. కరోనా కారణంగా మరణించినవారి కుటుంబానికి రూ. 50 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని గతంలో న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ చెల్లింపుల విషయంలో ఏపీ, బీహార్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాలు నిర్లక్ష్యం వహించాయి. దీనిపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఏపీ, బీహార్ రాష్ట్రాలకు చెందిన ప్రధాన కార్యదర్శులు కోర్టు ముందు హాజరుకావాలని, పరిహారం ఎందుకు ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement