Thursday, April 25, 2024

ఫ్లై ఓవ‌ర్ ప‌నుల‌ను ప‌రిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్

రూ.636.80 కోట్ల వ్యయంతో ఆరాంగర్ నుండి జూపార్కు వరకు నిర్మాణంలో ఉన్న 6 లైన్ల ఫ్లై ఓవర్ పనుల పురోగతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప‌రిశీలించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ…. 4.5 కిలోమీటర్ల అతి పెద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం 2023 మార్చి వరకు పూర్తి చేయాలన్న లక్ష్యంతో నిర్మాణం జ‌రుగుతుంద‌న్నారు. అలాగే వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి) లో భాగంగా చేపట్టిన బహదూర్ పురా జంక్షన్ నిర్మాణ పనులను సీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, త‌దిత‌రులున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement