పాకిస్తాన్ భూభాగంలోకి దూసుకెళ్లిన ఇండియా మిస్సైల్పై ఇరు దేశాల మధ్య ఆందోళన నెలకింది. అయితే.. రొటీన్ మెయింటనెన్స్లో భాగంగానే తమ మిస్సైల్ ఫైర్ అయ్యిందని, ఇది సాంకేతిక లోపం కారణంగా జరిగిందని భారత్ అధికారులు తెలిపారు. దీన్ని తాము సీరియస్గా తీసుకున్నట్టు తెలిపారు. దీనిపై ఉన్నత స్థాయి కోర్టు విచారణకు కూడా ఆదేశించామన్నారు. అయితే ఆ క్షిపణి పాకిస్థాన్లోని ఓ ప్రాంతంలో ల్యాండ్ అయ్యిందని అధికారులు తెలిపిన ఓ నోట్లో పేర్కొన్నారు. ఈ ఘటన చాలా విచారకరం ప్రమాదం కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించే విషయమని అధికారులు స్పష్టం చేశారు.
అయితే.. పాకిస్తాన్ ఈరోజు ఇస్లామాబాద్లోని భారతదేశ ఛార్జ్ డి’అఫైర్స్ ను పిలిపించింది. కాగా, మొన్న (మార్చి 9న) సాయంత్రం 6:43 గంటలకు దేశంలోని సూరత్గఢ్ నుండి పాకిస్తాన్లోకి సూపర్-సోనిక్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అనుకోకుండా ఫైర్ అయ్యిందని, విదేశాంగ కార్యాలయానికి పిలిపించిన భారతీయ దౌత్యవేత్తకు పాక్ అధికారులు తెలిపారు. భారత్కు చెందిన “సూపర్-సోనిక్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్” తమ గగనతలంలోకి రావడం రెచ్చగొట్టే చర్యగానే తాము భావిస్తున్నామని ఆరోపిస్తున్నారు. తమ తీవ్ర నిరసన తెలియజేశారు. ఈ సంఘటనపై సమగ్ర, పారదర్శక దర్యాప్తును చేయాలని కోరారు. ఆ వస్తువు పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లోని మియాన్ చున్నూ నగరానికి సమీపంలో సాయంత్రం 6:50 గంటలకు నేలపై పడింది. దీనివల్ల పౌరుల ఆస్తులకు భారీ నష్టం వాటిల్లినట్టు పాకిస్తాన్ అధికారులు చెబుతున్నారు.