Wednesday, May 1, 2024

Dhee: ‘ఢీ’ నుంచి సుధీర్, రష్మి ఔట్!

‘ఢీ’ షోకి యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ షో అంటే డాన్సుల కంటే ముందుగా గుర్తుకొచ్చేది సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్. ఈ ఇద్దరూ కలిసి ఈ షోను సూపర్ సక్సెస్ చేసారు. ఈ షో సుడిగాలి సుధీర్ చేసే కామెడీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సుధీర్, రష్మి లేని ఢీ షో ఊహించడం కూడా కష్టమే. అలాంటిది సుధీర్, రష్మీ ఇద్దరు ఆ షో నుంచి మాయం అయ్యారు.

త్వరలో ‘ఢీ’ 14 షో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే, అందులో సుధీర్, రష్మి ఇద్దరూ కనిపించడం లేదు. అది చూసిన తర్వాత అభిమానులు షాక్ అవుతున్నారు. సుధీర్, రష్మి తప్పుకున్నారా? లేక తీసివేయబడ్డారా? అన్నది సస్పెన్స్ గా ఉంది. గత సీజన్ లో కొత్తగా వచ్చిన దీపిక పిల్లి కూడా షోలో కనిపించడం లేదు.  

ఢీ షో ఆస్థాన యాంకర్ ప్రదీప్, హైపర్ ఆది మాత్రం అలాగే ఉన్నారు. ప్రియమణి, గణేష్ మాస్టర్ జడ్జిలుగా కొనసాగుతున్నారు. కానీ ఈ షోకి క్రేజ్ తీసుకొచ్చిన సుడిగాలి సుధీర్, రష్మిలు కనిపించకపోవడం వారి అభిమానులను నిరాశకు గురి చేసింది. సుధీర్ స్థానంలో బిగ్ బాస్ సీజన్ 4 రన్నరప్ అఖిల్ సార్థక్‌ను తీసుకొచ్చారు. ఇక, గతంలో జడ్జిగా ఉన్న పూర్ణ కూడా కనిపించడం లేదు. ఆమెకు సినిమా అవకాశాలు పెరగడంతో అక్కడ బిజీ అయిపోయినట్లు తెలుస్తోంది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement