Friday, April 26, 2024

అమ్మకు నీరాజనం.. సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం

నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రపంచం మెచ్చిన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ తీరంలో అద్భుతమైన ఇసుక శిల్పాన్ని రూపొందించి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. అందమైన అమ్మ ముఖాన్ని చెక్కి అన్ని రంగాల్లో రాణిస్తున్నారనే అర్థం వచ్చేలా ఈ శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఈ కళాఖండం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతి ఏడాది మాతృ దినోత్సవం రోజుల భిన్న రకాలుగా శిల్పాలను చెక్కి శుభాకాంక్షలు చెప్పే సుదర్శన్ ఈ ఏడాది ఇలా రూపొందించారు. I LOVE MY MOTHER అంటూ చెక్కిన ఈ శిల్పాన్ని అయన ట్విట్టర్ ద్వారా షేర్ చేసి తల్లులకు వందనం అని రాసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement