Friday, May 17, 2024

భారీ లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేటి స్టాక్ మార్కెట్లు భారీ లాభాల‌తో ముగిశాయి. నిన్న సెన్సెక్స్ 2,700పాయింట్లు కోల్పొయింది. అయితే నేడు 1,300 పాయింట్లకు పైగా లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సహకారం లభించడంతో పాటు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు లాభాల్లో కొనసాగాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,328 పాయింట్లు లాభపడి 55,858కి ఎగబాకింది. నిఫ్టీ 410 పాయింట్లు పెరిగి 16,658కి చేరుకుంది. ఈరోజు అన్ని సూచీలు లాభపడ్డాయి. మెటల్, రియాల్టీ సూచీలు 5 శాతానికి పైగా లాభపడ్డాయి. ఈనాటి ట్రేడింగ్ లో 2,567 షేర్లు అడ్వాన్స్ కాగా, 724 షేర్లు డిక్లైన్ అయ్యాయి. 89 షేర్లు మారకుండా స్థిరంగా ఉన్నాయి. టాటా స్టీల్ (6.54%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.83%), బజాజ్ ఫైనాన్స్ (5.16%), ఎన్టీపీసీ (4.91%), టెక్ మహీంద్రా (4.26%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. నెస్లే ఇండియా (-0.25%), హిందుస్థాన్ యూనిలీవర్(-0.02%) సెన్సెక్స్ లూజర్స్ గా మిగిలాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement