Saturday, May 4, 2024

లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్స్-సెన్సెక్స్ 379 పాయింట్లు

నేడు ఉద‌యం లాభాల‌తో ప్రారంభ‌మ‌యిన స్టాక్ మార్కెట్లు అదే లాభాల‌తో ముగిశాయి. ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పట్టడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 379 పాయింట్లు లాభపడి 59,842కి చేరుకుంది. నిఫ్టీ 127 పాయింట్లు పెరిగి 17,825 వద్ద స్థిరపడింది. మహీంద్రా అండ్ మహీంద్రా (2.28%), మారుతి (2.19%), ఏసియన్ పెయింట్స్ (2.09%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.90%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.29%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.90%), భారతి ఎయిర్ టెల్ (-0.85%), బజాజ్ ఫైనాన్స్ (-0.26%), టీసీఎస్ (-0.20%), ఎన్టీపీసీ (-0.03%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement