Wednesday, May 15, 2024

న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేటి స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. ఈ ఏడాది భారత్ వృద్ధి రేటును ఫిచ్ 7.8 శాతం నుంచి 7 శాతానికి తగ్గించడం మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 412 పాయింట్లు కోల్పోయి 59,934కి పడిపోయింది. నిఫ్టీ 126 పాయింట్లు నష్టపోయి 17,877 వద్ద స్థిరపడింది. మారుతి (3.23%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.24%), ఎన్టీపీసీ (1.98%), హెచ్డీఎఫ్సీ (0.28%), భారతి ఎయిర్ టెల్ (0.17%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.. టెక్ మహీంద్రా (-3.13%), ఇన్ఫోసిస్ (-2.91%), టాటా స్టీల్ (-1.92%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.89%), యాక్సిస్ బ్యాంక్ (-1.70%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement