Friday, May 3, 2024

స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ్ ని క‌లిసిన – మంత్రి కేటీఆర్

ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడేందుకు చేసిన ప్ర‌పంచంలోనే రెండ‌వ అతిపెద్ద మాన‌వ‌ప్ర‌య‌త్నం హ‌రిత‌హారం అని తెలిపారు మంత్రి కేటీఆర్. దావోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లోని తెలంగాణ పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్‌తో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పంట భూములు సారాన్ని కోల్పోకుండా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని సద్గురు జగ్గీ వాసుదేవ్‌ అన్నారు.కాగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement