Saturday, April 20, 2024

Sankranthi: ప్రయాణికులకు శుభవార్త.. ఏపీకి ప్రత్యేక రైళ్లు

రైలు ప్రయాణికులకు శుభవార్త. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే పది ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వే.. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలుగురాష్ట్రాల ప్రయాణికుల కోసం అదనంగా ప్రత్యేర రైళ్లను ప్రకటించింది. కాచిగూడ-విశాఖపట్టణం-కాచిగూడ, కాచిగూడ-నర్సాపూర్-కాచిగూడ, కాకినాడ టౌన్-లింగంపల్లి-కాకినాడ టౌన్ స్టేషన్ల మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి.

కాచిగూడ-విశాఖపట్టణం మధ్య ఈ నెల 7, 14న, విశాఖపట్టణం-కాచిగూడ మధ్య 8, 16న, కాచిగూడ-నర్సాపూర్ మధ్య 11న, నర్సాపూర్-కాచిగూడ మధ్య 12న, కాకినాడ టౌన్-లింగంపల్లి రైలు 19, 21, లింగంపల్లి-కాకినాడ మధ్య 20, 22 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement