Friday, May 17, 2024

HYD: మరోసారి భారీగా పట్టుబడిన గంజాయి

హైదరాబాద్‌లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. పత్తి విత్తనాల మాటున గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను ఎస్‌వోటీ పోలీసులు సైబరాబాద్‌లో పట్టుకున్నారు. ముఠాలో ఇద్దరు సభ్యులను అరెస్టు చేశారు. వారి నుంచి 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌ మీదుగా యూపీకి గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. మరో ముగ్గురు యూపీ వాసులు పరారీలో ఉన్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement