Monday, May 6, 2024

వరుసగా ఆరో రోజు లాభాలతో ముగిసిన.. స్టాక్ మార్కెట్లు

వరుసగా ఆరో రోజు లాభాలతో ముగిశాయి నేటి స్టాక్ మార్కెట్లు. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతలు ఉన్నప్పటికీ, మన మార్కెట్లు లాభాలను మూటకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 104 పాయింట్లు లాభపడి 59,307కి చేరుకుంది. నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 17,576 వద్ద స్థిరపడింది. బ్యాంకెక్స్ సూచీ 2 శాతానికి పైగా లాభపడింది. యాక్సిస్ బ్యాంక్ (8.96%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.13%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.11%), కోటక్ బ్యాంక్ (2.05%), నెస్లే ఇండియా (1.43%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. బజాజ్ ఫైనాన్స్ (-3.20%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.39%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.63%), ఎల్ అండ్ టీ (-1.51%), ఏసియన్ పెయింట్స్ (-1.38%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement