Monday, April 29, 2024

Tokyo Paralympics: భారత్ కు మరో పతకం

టోక్యో పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు పతకాల సాధిస్తున్నారు. సోమ‌వారం ఒక్క‌రోజే ఐదు మెడ‌ల్స్ గెల‌వ‌గా.. మంగ‌ళ‌వారం భారత్ కు మరో పతకం దక్కింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్​ పిస్టల్​ విభాగంలో భారత షూటర్ సింఘరాజ్ అదానా కాంస్య పతకం సాధించాడు. ఫైన‌ల్లో అత‌డు 216.8 పాయింట్లు సాధించాడు. 

కాగా, టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు మహిళా షూటర్ అవని లేఖర తొలి స్వర్ణం అందించడం తెలిసిందే. భార‌త్ ఇప్ప‌టి వ‌ర‌కూ సాధించిన మొత్తం ప‌త‌కాల సంఖ్య 8కి చేరింది. ఇందులో రెండు గోల్డ్‌, నాలుగు సిల్వ‌ర్‌, మ‌రో రెండు బ్రాంజ్ మెడ‌ల్స్ ఉన్నాయి. నిన్న జావెలిన్ త్రో క్రీడాకారుడు సుమీత్ ఆంటిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement