Monday, April 29, 2024

భ‌గ‌వంత్ మాన్ కి షాక్ – సంగ్రూర్ లోక్ స‌భ ఉప ఎన్నిక‌ల్లో ఆప్ ప‌రాజ‌యం

సంగ్రూల‌ర్ లోక్ స‌భ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఆప్ ప‌రాజ‌యం పాల‌యింది. సంగ్రూర్ నుంచి వ‌రుస‌గా 2014, 2019 ఎన్నిక‌ల్లో ఎంపీగా గెలిచిన భ‌గ‌వంత్‌… మొన్న‌టి పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆప్ సీఎం అభ్య‌ర్థిగా ఎంపిక కావ‌డం, ఆప్ ఘ‌న విజ‌యం సాధించ‌డంతో సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. దీంతో ఆయ‌న సంగ్రూర్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ఈ క్ర‌మంలో సంగ్రూర్ లోక్ స‌భ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కాగా… ఆదివారం మ‌ధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు కూడా పూర్తి అయిపోయింది. ఉప ఎన్నిక‌లో ఆప్ త‌ర‌ఫున గుర్మైల్ సింగ్ బ‌రిలోకి దిగారు. శిరోమ‌ణి అకాలీద‌ళ్ (అమృత్‌స‌ర్‌) పార్టీ త‌ర‌ఫున సిమ్ర‌న్ జిత్ మాన్ నిల‌వ‌గా… గుర్మైల్‌పై ఆయ‌న 8 వేల ఓట్ల పై చిలుకు మెజారిటీతో విజ‌యం సాధించారు.దాంతో భ‌గ‌వంత్ మాన్‌కు షాక్ త‌గిలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement