Saturday, April 27, 2024

ప్ర‌ధాని మోడీకి షాక్.. ఎన్నిక‌ల ర్యాలీకి నో ప‌ర్మిష‌న్..

ఈ నెల 24వ తేదీన షిల్లాంగ్..తురాలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొనాల్సి ఉంది..60 స్థానాలతో కూడిన మేఘాలయ అసెంబ్లీకి ఈ నెల 27న ఎన్నికలు జరనగున్నాయి. మార్చి 2న కౌంటింగ్ నిర్వహించి ఫలితం వెల్లడిస్తారు. ఈ క్రమంలో ఎన్పీపీ అధినేత, మేఘాలయ సీఎం కాన్రాడ్ కె సంగ్మా సొంత నియోజక వర్గమైన సౌత్ తురాలోని పీఏ సంగ్మా స్టేడియంలో ప్రధాని మోడీ ఎన్నికల ర్యాలీని నిర్వహించేందుకు బీజేపీకి అనుమతి కోరింది. అయితే మేఘాలయ క్రీడా విభాగం అనుమతిని నిరాకరించింది. స్టేడియంలో ఇంకా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెబుతూ బీజేపీ దరఖాస్తును తిరస్కరించింది.

కాగా రూ. 127 కోట్లతో నిర్మించిన ఈ స్టేడియాన్ని గతేడాది డిసెంబర్ 16న ముఖ్యమంత్రి కాన్రాడ్ ప్రారంభించారు. స్టేడియం ప్రారంభోత్సవం జరిగిన రెండు నెలల తర్వాత ప్రధానమంత్రి ర్యాలీకి స్టేడియం అసంపూర్తిగా ఉందని, అందుబాటులో లేదని ఎలా చెబుతారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కావాలనే మోదీ ర్యాలీ, సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. మేఘాలయలో మోడీ హవా చూసి అక్కడి ప్రభుత్వం భయపడుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రితురాజ్ సిన్హా అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల ర్యాలీలకు ప్రజల స్పందన చూసి ఇతర పార్టీలు అవాక్కయ్యాయని సిన్హా ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement