Wednesday, May 1, 2024

‘ఫ‌ల‌క్ నుమా దాస్’ కి సీక్వెల్ – ద‌ర్శ‌కుడిగా దూసుకెళ్తోన్న హీరో విశ్వ‌క్ సేన్

కెరియ‌ర్ ఆంభంలోనే ఫ‌ల‌క్ నుమాదాస్ చిత్రంలో న‌టించి హిట్ కొట్టాడు హీరో విశ్వ‌క్ సేన్. ఆ తరువాత నటనలోను .. బాడీ లాంగ్వేజ్ లోను తనదైన ప్రత్యేకతను సంతరించుకున్న విష్వక్ సేన్, హీరోగా ఎదగడంపైనే పూర్తి దృష్టి పెట్టాడు. ‘పాగల్’ సినిమాతో ఆకట్టుకోలేకపోయాడు. కాగా ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. అంతేకాదు .. ‘ఫలక్ నుమా దాస్’ సినిమాకి సీక్వెల్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా చెప్పాడు. ఈ సినిమా తరువాత యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చేయనున్న విషయాన్ని స్పష్టం చేశాడు. ఇక హీరోగానే కాదు దర్శకుడిగా కూడా విష్వక్ సేన్ వరుస సినిమాలతో ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడన్న మాట.

Advertisement

తాజా వార్తలు

Advertisement