Friday, May 3, 2024

ఈ రోజూ కివీస్‌దే… టీమిండియాకు సెమీస్ అవకాశాలు సంక్లిష్టం

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఆట‌తీరు అంత బాగాలేదు. బ్యాటింగ్‌, బౌలింగ్ లైన‌ప్‌లోనూ ఇత‌ర టీమ్స్ కంటే దారుణంగా ఉంది. సూపర్-12 దశ మొదటి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైన భారత్… తాజాగా న్యూజిలాండ్ చేతిలోనూ భంగపడింది.

దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ పై కివీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించారు. భారత్ విసిరిన 111 పరుగుల లక్ష్యాన్ని 14.3 ఓవర్లలోనే ఛేదించారు. ఓపెనర్ డారిల్ మిచిల్ 49 పరుగులు చేయగా, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (33 నాటౌట్) తనదైన శైలిలో ఇన్నింగ్స్ నడిపించాడు.

డారిల్ మిచెల్ స్కోరులో 4 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. అంతకుముందు సీనియర్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 20 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తర్వాత మిచెల్, విలియమ్సన్ జోడీ స్కోరు బోర్డును ముందుకు ఉరికించారు. మిచెల్ అవుటైనా… కాన్వేతో కలిసి విలియమ్స్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. చాన్నాళ్ల తర్వాత బౌలింగ్ వేసిన హార్దిక్ పాండ్య ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు.

ఈ మ్యాచ్ లో ఓటమి అనంతరం టీమిండియా సెమీస్ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడిన భారత్ కు, ఇతర జట్ల మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement