Wednesday, May 15, 2024

ఆవుకి సీమంతం.. 500మంది అతిథులు.. 48గిఫ్ట్స్

ఓ ఆవుకి సీమంతం చేసి ఆవుపై త‌మ‌కి ఉన్న ప్రేమ‌ని..భ‌క్తిని చాటుకున్నారు ఆ కుటుంబ‌స‌భ్యులు..వివ‌రాల్లోకి వెళ్తే.. త‌మిళ‌నాడులోని ఆలయంలో ఉన్న గోమాత‌కి ఘ‌నంగా సీమంతం వేడుక‌ని నిర్వ‌హించారు. రాష్ట్రంలోని కల్లకురిచ్చి జిల్లా శంకరాపురం గ్రామంలో గర్భిణిగా ఉన్న అంశవేణి అనే అవుకు ఈ వేడుక చేశారు. సీమంతం వేడుకకు అంశవేణిని బాగా అలంకరించారు. అంశవేణి సంరక్షణ చూస్తున్నఆరుతరమ్ తిరుపురసుందరి అమ్మై ఆలయ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఫంక్షన్ కు దాదాపు 500 మంది అతిథులు హాజరు కాగా వారందరికీ 24 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు.ఈ వేడుకకు హాజరైన వారు ఆవుకు గిఫ్టులు కూడా అందించారు. మహిళలు ధరించే కంకణాలతో సహా 48 రకాల కానుకలు కూడా ఆవుకు అందాయి.ఈ సీమంతం వేడుకలో భాగంగా ఆలయ అర్చకులు అంశవేణికి స్నానం చేయించారు. అనంతరం పూలు, గంటలతో అంశవేణిని అలంకరించారు. కార్యక్రమం పూర్తయ్యాక వచ్చిన అతిథులంతా అంశవేణి నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు.ఇప్పుడీ ఫొటోలు వైర‌ల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement