Saturday, May 4, 2024

స్కూబా డైవింగ్ చేసిన వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి – వైర‌ల్ గా వీడియో

స‌ముద్రంలో స్కూబా డైవింగ్ ని చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు. కానీ చేయాలంటే ఎంతో థైర్యం కూడా కావాలి. కాగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సాహ‌సానికి ఒడిగ‌ట్టారు. అండ‌మాన్ స‌ముద్రంలో ఆయ‌న స్కూబా డైవింగ్ ని చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అండ‌మాన్ స‌ముద్రంలో 12మీట‌ర్ల లోతైన నీటిలో ఉన్న జీవితాన్ని చూడ‌టం పూర్తిగా అద్భెత‌మైన అభ్యాస అనుభ‌వం అని ఆయ‌న తెలిపారు. స్కూబా డైవింగ్ థ్రిల్లింగ్‌గా ఉంది, సముద్రంలో అందమైన జీవితం యొక్క మాయాజాలంతో నేను ఆశ్చర్యపోయాను.” అంటూ తన టూర్ విశేషాల‌ను తెలియ‌జేస్తూ కామెంట్‌ చేశారు. ఎప్పుడు ప్ర‌తిప‌క్షంపై విరుచుకుప‌డే ఈయ‌న రిలాక్స్ అవుతూ క‌నిపించ‌డం విశేషం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement