Saturday, May 4, 2024

స్కూల్ గోడ కూలి ముగ్గురు విద్యార్థులు మృతి : ప‌లువురికి గాయాలు

స్కూల్ మ‌రుగుదొడ్డి గోడ కూలి ముగ్గురు విద్యార్థులు మ‌ర‌ణించారు. ఈ సంఘ‌ట‌న త‌మిళ‌నాడు తిరున‌ల్వేలిలో చోటు చేసుకుంది. షేఫ‌ర్ హ‌య్య‌ర్ సెకండ‌రీ బాయ్స్ ప్రైవేట్ స్కూల్ లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. విద్యార్థులు మూత్రం పోయడానికి వెళ్లగా మరుగుదొడ్డి గోడ కూలింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు విద్యార్థులు గాయపడినట్టు స‌మాచారం. చనిపోయిన విద్యార్థుల మృతదేహాలకు పోస్ట్ మార్టం నిమిత్తం తిరునల్వేలి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిని వారికి చికిత్స అందిస్తున్నారు.

స్కూల్ భవనం పాతబడిందని, కరోనా కారణంగా ఏడాదిన్నరపాటు అది మూతపడే ఉందని పోలీసులు చెప్పారు. ప్రభుత్వం అనుమతివ్వడంతో ఇటీవలే స్కూల్ ను తెరిచారన్నారు. అయితే, స్కూళ్లు తెరిచే ముందు పాఠశాలల పరిస్థితిని చెక్ చేసుకోవాలని, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ముందే సూచించింది. కానీ అవేమి ప‌ట్టించుకోకుండా స్కూల్ యాజ‌మాన్యం అల‌స‌త్వం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement