Sunday, May 19, 2024

స‌హ‌స్రాబ్ది ఉత్స‌వాల‌కు త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ కి ఆహ్వానం ప‌లికిన ‘చిన‌జీయ‌ర్ స్వామి’

భ‌గ‌వ‌త్ రామానుజాచార్యుల స‌హ‌స్రాబ్ది ఉత్స‌వాల‌కు విచ్చేయ‌వ‌ల‌సిందిగా ఆహ్వానిస్తూ త‌మిళ‌నాడు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆర్ ఎన్ ర‌వికి ఆహ్వాన ప‌త్రాన్ని అందించారు చిన‌జీయ‌ర్ స్వామి. కాగా చిన‌జీయ‌ర్ స్వామి వెంట మైహోమ్ గ్రూప్ ఛైర్మ‌న్ జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు ఉన్నారు. శంషాబాద్ ముచ్చింతల్ లో ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు రామానుజాచార్యుల సహస్రాబ్ది (1000వ జయంతి) ఉత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఫిబ్రవరి 14న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముగింపు కార్యక్రమానికి హాజరవుతారు. 9వ తేదీన ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ హాజరుకానున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement