Monday, May 6, 2024

టీడీపీ స్క్రిప్ట్‌.. బీజేపీ స్పీచ్..: సొంత ఎజెండా లేదన్న సజ్జల

బీజేపీ నిర్వహించిన ప్రజాగ్రహ సభపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎజెండానే.. బీజేపీ ఎజెండా అని అన్నారు. టీడీపీ అనుబంధ విభాగంలా బీజేపీ పనిచేస్తోందని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీకి అనుగుణంగా జాతీయ పార్టీ పనిచేస్తోందన్నారు. ప్రజాగ్రహ దీక్షలో టీడీపీ స్క్రిప్ట్‌ను సోమువీర్రాజు చదివారని చెప్పారు. విభజన సమస్యలపై బీజేపీ ఏం చేస్తోంది? అని సజ్జల ప్రశ్నించారు. వైసీపీని ఎదుర్కొనేందుకు ఎందుకు సొంత ఎజెండా పెట్టుకోలేకపోతున్నారు? అని నిలదీశారు. టీడీపీ, బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

ఏపీ బీజేపీని చూస్తుంటే జాలితో పాటు బాధ కలుగుతోందన్నారు. మళ్లీ సీఎం అవుతానన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారని, అందుకే ఇప్పటి నుంచే పొత్తు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సొంత అజెండాతో బీజేపీ ఎందుకు పనిచేయడం లేదన్న సజ్జల.. తన పార్టీ ఎంపీలు బీజేపీలో చేరితే టీడీపీ ఎందుకు ప్రశ్నించదని నిలదీశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement