Wednesday, April 24, 2024

పురాత‌న ఆల‌యాల అభివృద్ధికి పెద్ద పీట : మంత్రి మ‌ల్లారెడ్డి

తెలంగాణ ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ పురాతన ఆలయాల అభివృద్ధికి పేద్ద పీఠ వేస్తున్నాయ‌ని రాష్ట్ర కార్మిక‌శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి తెలిపారు. ఈరోజు
పోచారం మున్సిపల్ పరిధిలోని యంనం పెట్ శ్రీ బునిలసమేత గోదా రంగనాథ స్వామి దేవస్థాన ట్రస్ట్ బోర్డ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యంనం పెట్ శ్రీ బునిలసమేత గోదా రంగనాథ స్వామి దేవస్థాన ట్రస్ట్ బోర్డ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. దేవస్థాన ఛైర్మన్ గా పొలాగోని రాజేశ్ గౌడ్, డైరెక్టర్ లు గా సగ్గు రవిందర్, రగుల నరేందర్, నల్ల రాళ్ళ నిర్మల చంద్ర రెడ్డి, లక్ష్మణ్ నాయక్ లకు నియామక ప‌త్రాల‌ను అందజేశారు.

అనంత‌రం మంత్రి మాట్లాడుతూ… ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మున్సిపల్ ఛైర్మెన్ బోయపల్లి కొండల్ రెడ్డి, వైస్ ఛైర్మన్ రెడ్యా నాయక్, జిల్లా ఎండోమెంట్ అధికారిణి భాగ్యలక్ష్మి, కమిషనర్ సురేష్, ఘట్కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, కౌన్సిలర్లు నర్రి ధనలక్ష్మి, గొంగళ్ల మహేష్, సింగిరెడ్డి సాయి రెడ్డి, అకిటి శైలజ, సర్వీ సుధ లక్ష్మీ, ఘట్కేసర్ మున్సిపల్ ఛైర్మెన్ పావని, నాయకులు చామ‌కూర‌ భద్ర రెడ్డి ,పోచారం మున్సిపల్ తెరాస పార్టీ అధ్యక్షులు మందడి సురేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గొంగళ్ల బాలేష్, ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శేఖర్, గొంగళ్ల స్వామి నర్రి కాశయ్య, బద్దం జగన్ మోహన్ రెడ్డి, అకిటి బల్ రెడ్డి, మోటుపల్లి శ్రీనివాస్, బొక్క బుచ్చి రెడ్డి కో అప్షన్ సభ్యులు అక్రమ్, నల్లవెల్లి మురళి, రాఘవేంద్ర రెడ్డి, శశిధర్ రెడ్డి, గండి పల్లి శేఖర్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement