Monday, May 6, 2024

Breaking: హైకోర్టులో సాయిపల్లవికి ఎదురుదెబ్బ​.. పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆర్డర్​!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్​ హీరోయిన్​ సాయిపల్లవి చేసిన కామెంట్స్​ సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి. అయితే అవి తాను ఎవరినీ కించపరచడానికి చేసినవి కావని, తన ఉద్దేశం వేరని, దీనిపై ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరింది. అయితే.. ఈ వ్యాఖ్యలపై హైదరాబాద్​ సుల్తాన్​ బజార్​ పోలీసు స్టేషన్​లో బజరంగ్​దళ్​ కార్యకర్త కేసు పెట్టారు. దీన్ని సవాల్​ చేస్తూ సాయిపల్లవి హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. కాగా, దీనిపై ఇవ్వాల హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కేసు విషయంలో జోక్యం చేసుకోలేమని, పోలీసు స్టేషన్​కు హాజరుకావల్సిందేనని ధర్మాసనం ఆర్డర్​ వేసింది.

కశ్మీర్ మారణహోమంపై తాను చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ సుల్తాన్‌బజార్ పోలీసులు జారీ చేసిన నోటీసును కొట్టివేయాలని కోరుతూ నటి సాయిపల్లవి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఓ ఇంటర్వ్యూలో గోసంరక్షణను కాశ్మీర్ మారణహోమంతో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారంటూ బజరంగ్ దళ్ కార్యకర్త అఖిల్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై జూన్ 21న పోలీసుల ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

తనపై దాఖలైన ఫిర్యాదు చట్టవిరుద్ధమని, ఏకపక్షమని సాయి పల్లవి తన పిటిషన్‌లో పేర్కొంది. అయితే, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత ధర్మాసనం జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. పోలీసుల ముందు హాజరు కావాలని కోరింది.

సాయిపల్లవి ఏమన్నదంటే..

ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. రాజకీయంగా తనకు పెద్దగా తెలియదని, తాను సైద్ధాంతికంగా తటస్థంగా ఉన్నానని, అలా పెరిగానని పేర్కొంది. వామపక్షాలు లేదా ఇతర పార్టీలు సరైనవో తనకు తెలియదని ఆమె అన్నారు. లెఫ్ట్ వింగ్‌, రైట్‌వింగ్‌ల గురించి విన్నాను.. కానీ, ఎవరు ఒప్పు, ఎవరు తప్పు అని చెప్పలేను. ఇక.. కాశ్మీరీ పండిట్‌లను ఎలా చంపేశారో ‘‘ది కాశ్మీర్ ఫైల్స్’’ అనే సినిమాలో చూపించారు.. తాజాగా ఓ వ్యక్తి ఘటన జరిగింది. ముస్లిం అని అనుమానించి ఆవును తీసుకెళ్లినందుకు చంపారు. వ్యక్తిని చంపిన తర్వాత దాడి చేసిన వారు ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. కాశ్మీర్‌లో జరిగిన దానికి ఇటీవల జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది?” అని ఆమె చెప్పింది.

- Advertisement -

ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో దీనిపై సాయిపల్లవి వివరణ కూడా ఇచ్చారు. ఏదైనా మతం పేరుతో హింస చేయడం పెద్ద పాపమని తెలియజేయడమే తన ఉద్దేశమని, ఇంటర్వ్యూలోని స్నిప్పెట్‌లను సందర్భోచితంగా తీయడం జరిగిందని ఆమె అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement