Wednesday, May 8, 2024

పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్ తేజ్.. ఇదిగో సాక్ష్యం!

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మా కుటుంబ సభ్యులకు ఇది నిజమైన పండుగ అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడని చెప్పారు.  దీపావ‌ళికి మెగా ఫ్యామిలీ హీరోలు అంద‌రు క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేశారు. సాయి ధరమ్ తేజ్ సహా రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, పవన్ కొడుకు అకీరా నందన్, వైష్ణవ్ తేజ్ ఉన్నారు.

కాగా, వినాయ‌క‌చ‌వితి రోజున సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్పోర్ట్స్ బైక్ జారిపోవడంతో ఆయన కిందపడ్డారు. ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్‌ తలతో పాటు ఛాతీ, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్‌తేజ్‌ను 108 సాయంతో సమీపంలోని మెడికవర్‌ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో 35 రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. స‌రిగ్గా విజ‌య‌ద‌శ‌మి రోజు సాయిధ‌రమ్ తేజ్ డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌మాదం త‌ర్వాత సాయి ధ‌ర‌మ్ తేజ్ తొలి ఫొటో ఇదే కావ‌డంతో మెగా అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement