Friday, May 17, 2024

జ‌గిత్యాల జిల్లాలో యాక్సిడెంట్‌.. ముగ్గురు మృతి

జగిత్యాల జిల్లాలో దారుణ‌మైన యాక్సిడెంట్ అయ్యింది. మల్యాల మండలం రాజారం వద్ద ఆటో, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతిచెందారు. మ‌రో అయిదుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. జగిత్యాల నుంచి నూకపల్లి వెళుతుండగా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. నూకపల్లి అర్బన్‌ కాలనీలో మృతుల‌ను డ‌బుల్ బెడ్రూం ఇళ్లలో పనిచేసే కూలీలుగా గుర్తించారు. ఆటో జగిత్యాల నుండి మల్యాలకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గోపాల్, బత్హిని సంజీవి అక్కడికక్కడే చ‌నిపోయారు. దీనిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement