Friday, May 10, 2024

Breaking | బస్సును ఢీకొట్టిన కారు.. చంద్రాపూర్​లో అయిదుగురు మృతి

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఇవ్వాల సాయంత్రం (ఆదివారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులు, కారు ఢీకొన్న‌ ఘటనలో అయిదుగురు చ‌నిపోయిన‌ట్టు తెలుస్తోంది. మ‌రో బాలిక తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. నాగ్‌భిడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్పా గ్రామంలో ఇవ్వాల సాయంత్రం ఈ ఘోర ప్రమాదం జరిగిన‌ట్టు తెలుస్తోంది.

నాగ్‌పూర్ నుంచి నాగ్‌భిడ్‌కు కారులో ఆరుగురు వ్యక్తులు బయలుదేరారు. ఈ క్రమంలోనే కారు ప్రయాణికుల బస్సును ఢీకొట్టింది. కారులోనే నలుగురు మృతి చెందగా.. మరో ఇద్దరిని నాగ్‌భిడ్‌ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఒకరు చ‌నిపోయార‌ని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో బాలిక తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement