Sunday, April 28, 2024

ఆర్కే బీచ్ లోకి నో ఎంట్రీ .. ప‌లుచోట్ల కుంగిన భూమి ..

ఆర్కేబీచ్ లో స‌ముద్రం ముందుకి వ‌చ్చింది. జ‌వాద్ తుఫాన్ కార‌ణంగా విశాఖ‌ప‌ట్నం సముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారిపోయింది. దాంతో దుర్గాల‌మ్మ ఆల‌యం వ‌ర‌కు రెండు వంద‌ల మీట‌ర్ల భూమి కోత‌కు గురి అయింది. దాంతో ప‌లు చోట్ల భూమి కుంగింది. సమీపంలోని పిల్లల పార్క్ , ప్రహరీ గోడ కూలిపోయింది.. బల్లలు విరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆర్కే బీచ్ లోకి పర్యాటకులను నిషేధించారు. ఎవరూ రాకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. తుపాను నేటి మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరి తీరాన్ని తాకే అవకాశముంది. బలహీన పడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement