Friday, April 26, 2024

నిల‌క‌డ‌గా రిష‌బ్ పంత్ ఆరోగ్యం.. చూసేందుకు ఎవ‌రూ రావొద్దు.. డీడీసీఏ విజ్ఞ‌ప్తి

కారు యాక్సిడెంట్ లో తీవ్ర‌గాయ‌లు అయి డెహ్రాడూన్ మాక్స్ హాస్ప‌ట‌ల్ లో చికిత్స పొందుతున్నాడు టీం ఇండియా స్టార్ క్రికెట‌ర్ రిష‌బ్ పంత్. కాగా ఆయ‌న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డీడీసీఏ శర్మ పేర్కొన్నారు. పంత్‌ తన తల్లిని కలవడానికి ఇంటికి వెళ్తుండగా కారు డివైడర్‌ను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత డెహ్రాడూన్‌లోని మాక్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం తర్వాత కారు మంటలకు ఆహుతైంది. పంత్‌ తల, కాళ్లకు గాయాలయ్యాయి.

ప్రస్తుతం అతనికి చికిత్స పొందుతున్నాడని, పంత్‌ను కలిసేందుకు ఎవరూ ఆసుపత్రికి వెళ్లొద్దని అభిమానులతో పాటు వీఐపీలకు డీడీసీఏ విజ్ఞప్తి చేసింది. పంత్‌ను కలిసేందుకు వెళ్తే అతనికి ఇన్ఫెక్షన్‌ సోకే అవకాశం ఉందని, ఈ క్రమంలో కలిసేందుకు సిద్ధమైనవారంతా మానుకోవాలని సూచించారు. బీసీసీఐ వైద్యులు.. హాస్పిటల్‌ వైద్యులతో టచ్‌లో ఉన్నారన్నారు. జై షా పరిస్థితి పర్యవేక్షిస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement