Monday, April 29, 2024

రేవంత్ రెడ్డి ఏ పార్టీలో.. ఆ పార్టీ మటాష్.. మంత్రి మల్లారెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి పెట్టింది రచ్చబండ కాదు.. లుచ్చా బండ అన్నారు. రేవంత్ రెడ్డి ఓ దొంగ రెడ్డి అన్నారు. రేవంత్ ఏపార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్ అన్నారు. రేవంత్ రెడ్డి చేసేదంతా బ్లాక్ మెయిల్ అన్నారు. రేవంత్ రెడ్డి అప్పుడే సీఎం అయిపోయినట్లు మాట్లాడుతున్నారన్నారు. మా నేతలు పెట్టుబడుల కోసం తిరుగుతున్నారు…. మీ రాహుల్ గాంధీ నైట్ క్లబ్బులు తిరుగుతున్నాడన్నారు. రేవంత్ బీజేపీకి వెళ్లడం ఖాయమన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు నన్ను కూడా బ్లాక్ మెయిల్ చేశాడన్నారు. నా కాలేజీలు మూయించేస్తానని బెదిరించాడన్నారు. మల్కాజిగిరి సీటు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement