Friday, April 26, 2024

Twitter war: కవిత ట్వీట్ కు రేవంత్ రెడ్డి కౌంటర్

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. రాహుల్ పర్యటనపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. రాహుల్ గాంధీకి వెల్‌కమ్ చెబుతూనే తనదైన శైలి సెటైర్లు వేశారు. తెలంగాణ హక్కుల విషయంలో, రాష్ట్రానికి జరుగుతున్న నష్టానికి సంబంధించి పార్లమెంట్‌లో కేంద్రాన్ని ఒక్కసారైనా నిలదీయలేదని.. అప్పుడు ఎక్కడున్నారంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కవితకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

‘శ్రీమతి కవిత గారూ.. రాహుల్ గాంధీని ప్రశ్నించే ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మోదీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు.. మీరు ఎక్కడ ఉన్నారు? మీ తండ్రి మోదీ ముందు మోకరిల్లి తెలంగాణ నుంచి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ ఇచ్చి రైతులకు ఉరితాళ్లు బిగించినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? వరి వేస్తే ఉరే అని మీ తండ్రి ప్రవచనాలు చెప్పి ఆయన ఫాంహౌస్‌లో 150 ఎకరాలలో వరిపంట వేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ? ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిర్చి రైతులు పిట్టల్లా రాలిపోతుంటే మీరు ఎక్కడ ఉన్నారు?. రైతుకు రూ.లక్ష రుణమాఫీ చేస్తానని మీ తండ్రి పచ్చి మోసానికి ఒడిగడితే ప్రశ్నించాల్సిన మరెక్కడ ఉన్నారు? రాష్ట్రంలో రైతులకు అవసరమైన 26 లక్షల టన్నుల ఎరువులు ఫ్రీగా ఇస్తానని మీ తండ్రి చెప్పి ఐదేళ్లవుతున్నా అరక్వింటాల్ ఎరువులు కూడా ఇవ్వలేదు.. మరి మీరెక్కడ ఉన్నారు? అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యపు రాశులు తడిచి రైతులు బోరున విలపిస్తున్నారు. వారి కష్టం పట్టించుకోకుండా మీరెక్కడ ఉన్నారు? ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీతో కలిసి డ్రామాలాడి ఆలస్యం చేయడం వల్ల చాలా మంది రైతులు ఇప్పటికే మద్దతు ధర కంటే చాలా తక్కువగా రూ.1400 లోపే అమ్ముకుంటున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు?’ అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement