Monday, April 29, 2024

రాజంపేట వ‌ర‌ద‌ల‌పై అప్ డేట్ ఇచ్చిన ఎస్ఐ భ‌క్త‌వ‌త్స‌లం..

రాజంపేట వ‌ర‌ద‌ల్లో 38మంది గ‌ల్లంత‌య్యార‌ని మ‌న్నూరు ఎస్ఐ భ‌క్త‌వ‌త్స‌లం తెలిపారు. 25 మృతదేహాలు దొరికాయని వెల్ల‌డించారు. ఇంకా 13 మంది ఆచూకీ దొరకలేదని అన్నారు. కాగా గ‌ల్లంత‌యిన వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. వర్షాల వల్ల రూ.6,054 కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణ సాయం కింద రూ.వెయ్యి కోట్లు ఇచ్చి ఆదుకోవాలని కేంద్రాన్ని సీఎం జగన్ కోరిన సంగతి తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే ఎమ్మెల్యేలతో పాటు, ప్రతిపక్ష నేతలు పర్యటిస్తున్నారు. బాధితులకు చేదోడుగా నిలుస్తున్నారు. ఏపీలో వ‌ర్షాలు బీభ‌త్సం సృష్టించిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement