Friday, May 10, 2024

Minister : రాహుల్ లీడర్ కాదు రీడర్ .. జ‌గ‌దీష్ రెడ్డి

రాహుల్ గాంధీ లీడ‌ర్ కాదు రీడ‌ర్ అని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి అన్నారు. హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… రెండు సార్లూ ఏ ఐ సి సి అధ్యక్ష పదవిని అర్దాంతరంగా వదిలి పెట్టారన్నారు. రాసిచ్చింది చడవడమే ఆయన చేస్తున్న పని అన్నారు. నిన్నా, మొన్నా గల్లీ లీడర్లు మాట్లాడిన మాటలే ఆయన ఉటంకించారన్నారు. భాజపాకు బీఆర్ఎస్ రిశ్తేదార్ కాదు..
రాహులే మోడీకి గుత్తేదారు అన్నారు. నాలుగువేల ఫించన్ ఏ హోదాలో ప్రకటించారని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్న ఫించన్ ఎంత ? ఫించన్ ప్లకార్డులు రాహులు తెలిసి పట్టుకున్నారా తెలియక పట్టుకున్నారా అని అన్నారు. నాలుగు వేల ఫించన్ ఇచ్చేది నిజమే అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని కొనఊపిరితో బతికిస్తున్న చత్తీస్ ఘడ్ లో వృద్దులకు ఇచ్చేది 350 రూపాయలేన‌న్నారు. అదే రాష్ట్రంలో వికలాంగులకు రూ.500, వితంతువులకు ఇచ్చేది రూ.350 లు అన్నారు. అదే పార్టీ ఏలుబ‌డిలో ఉన్న రాజస్థాన్ లోనూ వృద్దులకు ఇచ్చేది రూ.750లు, వికలాంగులకు రూ.750లు, వితంతువులకు రూ.550లు మాత్రమేన‌న్నారు. సచ్చిపోతుందనుకున్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిన కర్ణాటకలోనూ ఇచ్చేది అంతకంటే ఎక్కువ లేదన్నారు.

కర్ణాటకలో వృద్దులకు రూ.800లు, విక‌లాంగులకు రూ.800లు, వితంతువులకు 800 రూపాయలేన‌న్నారు. కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించిన కర్ణాటకలో, కొన ఊపిరితో ఉన్న చత్తీస్ ఘడ్ లో, పార్టీని నిలబెట్టిన రాజస్థాన్ లో రూ.4,000 ఫించన్ ఎందుకు ఇవ్వడం లేదని జ‌గ‌దీష్ రెడ్డి ప్ర‌శ్నించారు. అందుకే ఆయనను లీడర్ గా కాకుండా రీడర్ గానే చూడాల్సి వస్తుందన్నారు. గల్లీ నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివి వినిపించారన్నారు. అది కుడా ఆయన ఏ హోదాలో ప్రకటించారు అన్నదే హాస్యాస్పదంగా మారిందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇవ్వని ఫించన్లు తెలంగాణాలో ఇస్తామని ప్రకటించడానికి సిగ్గుఉండాలన్నారు. రూ.4,000 ఫించన్ ప్రకటనను ఇక్కడి ప్రజలకు నమ్మశక్యంగా లేదన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్వాంగులకు రూ.4,000, వితంతువులకు రూ.2016, వృద్దులకు రూ.2,016లు ఇస్తున్నారన్నారు. కాళేశ్వరం కట్టిందే లక్ష కోట్లతో అయితే… కట్టిన మొత్తంలో స్కామ్ జరిగిందంటూ ఆరోపణలు చేయడం రాహుల్ అజ్ఞానాన్ని బయట పడేసిందన్నారు. కాళేశ్వరం కట్టింది నిజమో కాదో తెలియడానికి రాహుల్ మెడిగడ్డ మీద నుండి దూకితే తెలుస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement