Saturday, May 18, 2024

వైసీపీపై విరుచుకుపడ్డ రఘురామకృష్ణరాజు

ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీపై మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు తాజా విషయాలను వైసీపీకి అన్వయించుకుంటూ విమర్శిస్తూనే ఉన్నారు. తాజాగా తిరుమల వెంకన్న దేవస్థానంలో భక్తుల తలనీలాల విషయంపై స్పందించారు. తిరుమల వెంకన్నకు భక్తులు సమర్పించిన తలనీలాలు కూడా అమ్మకపోవడం సిగ్గుచేటని రఘురాజు మండిపడ్డారు. ఇన్నిరోజులు ఎర్రచందనాన్ని దొంగిలించారని… ఇప్పుడేమో తలనీలాలను దొంగిలిస్తున్నారని అన్నారు . వెంకన్న డబ్బులు దొంగిలించిన వారు బాగుపడినట్టు చరిత్రలో లేదని చెప్పారు. వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఇన్ని రోజులైనా ఛేదించకపోవడం దారుణమని అన్నారు.

ఇక బడ్జెట్ ను ఆర్డినెన్స్ ద్వారా ప్రవేశపెట్టిన పరిస్థితి దేశంలో ఎప్పుడూ లేదని విమర్శించారు. రాష్ట్రంలో అప్పులు భారీగా పెరిగిపోయాయని… రానున్న కాలంలో ఆర్థికంగా రాష్ట్రం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుందని అన్నారు. అయితే, దీని గురించి జగన్ మాట్లాడటమే లేదని చెప్పారు. ప్రజలు మరో నీరో చక్రవర్తిని ఎన్నుకున్నామనే భావనలో ఉన్నారని రఘురాజు అన్నారు. రుణ ఆంధ్రప్రదేశ్ స్థాయి నుంచి దివాళా ఆంధ్రప్రదేశ్ స్థాయికి రాష్ట్రం మారే పరిస్థితి దగ్గర్లోనే ఉందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల కోసం మద్యంపై ఆదాయాన్ని పెంచుకోవాల్సిన దుస్థితి దాపురించిందని అన్నారు. ఇక ఏపీ సీఎం పవన్ కల్యాణ్ అంటూ సోము వీర్రాజు ప్రకటించడం చూస్తుంటే…పవన్ వల్ల తమ పార్టీ వైసీపీకి ప్రమాదమేమో అనే అనుమానం కలుగుతోందని రఘురామకృష్ణరాజు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement