Friday, May 17, 2024

రాష్ట్రపతి బైపాస్ సర్జరీ విజయవంతం

ఛాతి నొప్పి కారణంగా ఈనెల 26న ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌కు బైపాస్ స‌ర్జ‌రీ విజ‌య‌వంత‌మైంది. ఈ విష‌యాన్ని కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపారు. విజ‌య‌వంతంగా ఆప‌రేష‌న్ చేసిన వైద్యుల‌ను అభినందించారు. రాష్ట్ర‌ప‌తి కోవింద్ త్వ‌ర‌గా కోలుకోవాలని రాజ్‌నాథ్ ఆకాంక్షించారు.

‘రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో నిర్వ‌హించిన బైపాస్ స‌ర్జ‌రీ విజ‌య‌వంత‌మైంది. విజ‌య‌వంతంగా స‌ర్జ‌రీ నిర్వ‌హించిన డాక్ట‌ర్ల‌ను అభినందిస్తున్నా. రామ్‌నాథ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్‌ డైరెక్టర్‌తో మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు. ఆయ‌న‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement