Saturday, May 4, 2024

వివేకా కేసు నిందితులను చంపేందుకు కుట్ర: సీబీఐకి RRR లేఖ

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందులను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐకి లేఖ రాశారు. పరిటాల నిందితులను అంతమొందించిన కుట్ర తరహాలోనే వైఎస్ వివేకా హత్య కేసు నిందితులను కూడా జైల్లోనే మట్టుబెట్టే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. జైల్లో ఉన్నవారికి, జైలు బయట ఉన్న నిందితులకు, సాక్షులకు రక్షణ కల్పించాలని రఘురామ కోరారు. వివేకా హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. ఈ కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా విచారించాలని సీబీఐ చీఫ్ ను కోరారు. ఇప్పటికే ఎన్నో సీబీఐ కేసుల్లో విజయసాయి ఏ2గా ఉన్నాడని, సీబీఐ ఆయనను పిలిచి వివేకా హత్య కేసులో ప్రశ్నించాలని తెలిపారు. ఈ కేసులో ‘గొడ్డలి’ అనే పదం ఎలా బయటికి వచ్చింది? ఈయనకు ఎవరు చెప్పి ఉండొచ్చు? అనే కోణంలో విచారించాలన్నారు. ‘గుండెపోటు’ అని చెప్పిన విజయసాయిరెడ్డిని విచారించాల్సిందేనని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డిని జైలుకు పంపేంతవరకు తాను విశ్రమించనని ఉద్ఘాటించారు. 


Advertisement

తాజా వార్తలు

Advertisement