Thursday, April 25, 2024

రాధేశ్యామ్ వాయిదా – యూవీ క్రియేష‌న్స్ ట్వీట్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ వాయిదా ప‌డింది. ఈ మేర‌కు చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ చిత్రాన్ని రాధాకృష్ణ తెర‌కెక్కించాడు. క‌రోనా ఆంక్ష‌ల నేప‌థ్యంలో మూవీని వాయిదా వేశారు. క‌రోనా నేప‌థ్యంలో థియేటర్లను మూసి వేయాలని పలు ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో జనవరి 14వ తేదీన విడుదల కానున్న రాధేశ్యామ్ సినిమాను వాయిదా వేసుకున్నట్లు చిత్రబృందం ప్రకటన చేసింది. అంతేకాదు ఈ సినిమాను వాయిదా వేసినందుకు ప్రభాస్ ఫ్యాన్స్ కు క్షమాపణలు కూడా చెప్పింది చిత్ర బృందం. అలాగే ఈ సినిమాను త్వరలోనే థియేటర్లలో విడుదల చేస్తామని… దానికి సంబంధించిన తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేసింది చిత్ర బృందం. ఈ మేర‌కు యూవీ క్రియేష‌న్స్ ట్వీట్ చేసింది. ఇక ఈ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement