Sunday, May 26, 2024

నాణ్యమైన విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు – ఎమ్మెల్యే దాసరి

ట్రినిటీ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య అందించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న 76 మంది విద్యార్థులు ఇటీవల నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్ లో పలు బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు పొందడంతో వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి తో పాటు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement