Tuesday, April 30, 2024

లాల్‌ద‌ర్వాజ సింహ‌వాహిని అమ్మ‌వారికి ద‌ర్శించుకున్న పీవీ సింధూ

పాతబస్తి లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర సంబురంగా జ‌రుగుతోంది. ఇవ్వాల (ఆదివారం) బ్యాడ్మింటన్ స్టార్‌ పీవీ సింధు అమ్మవారికి బోనం స‌మ‌ర్పించి మొక్కు చెల్లించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సింధు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది సింహవాహిని అమ్మవారిని దర్శించుకుంటాన‌న్నారు. అయతే గతేడాది బోనాల సమయంలో పోటీల వల్ల రాలేకపోయానని చెప్పారు. ఈసారి అమ్మవారికి బోనం సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఏటా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రజలందరికీ బోనాల జాతర శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, అమ్మవారికి బోనాలు సమర్మించేదుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తెల్లవారు జామునుంచే పెద్ద‌ సంఖ్యలో దర్శనానికి లైన్లలో వేచిఉన్నారు. బోనాల నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఇవ్వాల‌, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మరికొద్ది సేపట్లో ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌, హోంమంత్రి మహమూద్‌ అలీ అమ్మవారికి పట్టు వ‌స్త్రాలు సమర్పించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement