Tuesday, April 30, 2024

పీవీ సింధుకు.. ఎయిర్ పోర్టులో ఘ‌న స్వాగ‌తం

కామన్వెల్త్ గేమ్స్ లో PV సింధు గోల్డ్ మెడల్ సాధించిన విష‌యం విధిత‌మే. కామన్వెల్త్ లో బంగారు పతకం సాధించి తెలుగువారు గర్వపడేలా చేసింది సింధు. అయితే పీవీ సింధు హైదరాబాద్ కు చేరుకుంది. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న PV సింధుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. కామన్వెల్త్ గేమ్స్ లో తొలిసారి సింగిల్స్ లో PV సింధు స్వర్ణం సాధించింది. ఫైనల్లో కెనడా షట్లర్ మిషెల్లి లీపై గెలిచిన గోల్డ్ మెడల్ అందుకుంది. 2014 కామన్వెల్త్ లో మిషెల్లి లీ చేతిలో ఓడిన సింధు..ఇప్పుడు అదే షట్లర్ పై గెలిచి రికార్డు క్రియేట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement