Thursday, May 2, 2024

శ్రీలంక‌లో నిర‌స‌న‌ల వెల్లువ – పాల్గొన్న క్రికెట‌ర్స్

శ్రీలంక‌లో అధ్య‌క్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్ష‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. కాగా నిర‌స‌న కారుల‌కు మ‌ద్ద‌తుని ప్ర‌క‌టిస్తున్నారు ప‌లువురు. క్రికెట‌ర్లు కూడా ఈ నిర‌స‌న‌లో పాల్గొన‌డం విశేషం. ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక కొట్టు మిట్టాడుతోంది. . శ్రీలంకకు ప్రపంచ కప్ అందించిన అర్జున రణతుంగతోపాటు మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య ఆందోళనల్లో పాలుపంచుకున్నారు. అధ్యక్ష భవనం ఎదుట నిన్న వేలాదిమంది నిరసన తెలిపారు. జయసూర్య బారికేడ్లు ఎక్కి మరీ నినాదాలు చేశాడు. ఈ సందర్భంగా జయసూర్య మాట్లాడుతూ.. ఈ నిరసనలు ఎందుకు జరుగుతున్నాయో అధికారులకు అర్థమయ్యే ఉంటుందన్నాడు. ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాగా, అధ్యక్షుడు గొటబాయ రాజీనామా కోసం జరుగుతున్న నిరసనలకు ఇతర క్రికెటర్లూ మద్దతు తెలపాలని అర్జున రణతుంగ, జయసూర్య కోరారు. వీధుల్లోకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. మాజీ క్రికెటర్, ఐసీసీ రెఫరీ రోషన్ మహానామా, మాజీ కెప్టెన్లు మహేల జయవర్ధనే, కుమార సంగక్కర వంటి వారు ఇప్పటికే అధ్యక్షుడి రాజీనామా కోసం జరుగుతున్న ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. కాగా, అధ్యక్షుడి రాజీనామాను డిమాండ్ చేస్తూ మొదలైన నిరసనలు నిన్నటితో రెండో వారానికి చేరుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement