Tuesday, April 23, 2024

స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా కేసులు

క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి. దాంతో దేశంలో శ‌నివారం 975 కరోనా కేసులు నమోదవగా, నేడు 1150కి పెరిగాయి. నిన్నటికంటే ఇవి 17 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,30,42,097కు చేరాయి. ఇందులో 4,25,08,788 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,21,751 మంది మృతిచెందారు. ఇంకా 11,558 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 4 మరణించగా, 954 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.76 శాతంగా ఉన్నదని, 1.21 శాతం మంది మరణించారని వెల్లడించింది. ఇక ఇప్పటివరకు 1,86,51,53,593 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని, శనివారం 12,56,533 మంది వ్యాక్సినేషన్‌ చేశామని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement