Friday, April 26, 2024

Good news: త‌ల్లి అయిన ప్రియాంక‌.. స‌రోగ‌సీ ద్వారా పాప‌కు జన్మ

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్ దంపతులు అభిమానులకు గుడ్‌ న్యూస్ చెప్పారు. సరోగసీ ద్వారా తాను ఓ బిడ్డకు జన్మనిచ్చానాని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 2018లో ప్రియాంక, జొనాస్ వివాహం జరిగింది. వీరికి ఇదే తొలి సంతానం. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తీపి కబురు చెప్పిన ప్రియాంక దంపతులు.. బిడ్డకు జన్మనిచ్చినందుకు చెప్పలేనంత సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కుటుంబంపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందని, ఈ ప్రత్యేక సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దని ప్రేమపూర్వక విజ్ఞప్తి చేశారు.

ఇటీవలే 39వ పడిలో పడిన ప్రియాంక చోప్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పిల్లలు కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పిల్లలు తమ జీవితంలో పెద్ద భాగం అవుతారని అన్నారు. దేవుని దయతో అది జరిగినప్పడు జరిగి తీరుతుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement