Sunday, April 28, 2024

సీఎం మ‌మ‌తాబెన‌ర్జీకి.. తియ్య‌టి బ‌హుమ‌తి పంపిన బంగ్లాదేశ్ ప్ర‌ధాని

బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనా ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి తియ్య‌టి బ‌హుమ‌తిని పంపారు. దాదాపు 600 కిలోల మామిడి పండ్ల‌ను మమతబెన‌ర్జీకి బహుమతిగా పంపారు. మమతకు షేక్ హసీనా పంపిన పండ్లలో హిమ‌సాగ‌ర్‌, లంగ్రా ర‌కాలు ఉన్నాయి. దౌత్య‌ప‌ర‌మైన సంబంధాల్లో భాగంగా ఈ గిఫ్ట్‌ను అంద‌జేశారు. గ‌త ఏడాది కూడా మామిడి పండ్ల‌ను పంపారు అని బంగ్లాదేశ్ డిప్యూటీ హై క‌మిష‌న్ అధికారి ఒకరు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల‌కు చెందిన ముఖ్య‌మంత్రులు అందరికీ మామిడి పండ్లను బహుమతిగా హసీనా పంపారు. నిజానికి బంగ్లా పీఎం మామిడి పండ్ల దౌత్యం ఇదే తొలిసారి కాదు. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు బెంగాల్, త్రిపుర, అస్సాం రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పండ్ల‌ను గిఫ్ట్‌గా అంద‌జేసిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement