Saturday, April 27, 2024

PM Modi: ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..

ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఖాతాలో అగంతకులు బిట్ కాయిన్ ను ప్రచారం చేస్తూ పోస్టు చేశారు. బిట్ కాయిన్ ను భారత ప్రభుత్వం లీగల్  చేసిందని, ప్రభుత్వం 500 బిట్ కాయిన్ లు కొనుగోలు చేసి ప్రజలకు పంచుతోందని లింక్ లు పోస్టు చేశారు. దీంతో వెంటనే పీఎంవో అధికారులు స్పందించి.. ట్విట్టర్ కి ఫిర్యాదు చేసింది. దీంతో ఆ ట్వీట్ ను తొలగించారు. ఆ తర్వాత ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించారు. హ్యాక్ అయిన సమయంలో షేర్ అయిన ట్వీట్లను పట్టించుకోవద్దని పీఎంవో కార్యాలయం సూచించింది.

ఈ హ్యాకింగ్ గురించి తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ హ్యాండిల్‌ను భద్రపరచడానికి అవసరమైన చర్యలు తీసుకున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. ప్రధాన మంత్రి కార్యాలయంతో తాము 24 గంటలు ఓపెన్ లైన్‌లను కలిగి ఉన్నామమని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement