Thursday, May 2, 2024

రిషబ్ శెట్టితో కలిసి కాంతార సినిమా చూడనున్న- ప్రధాని నరేంద్ర మోడీ

ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు కాంతార చిత్రంపై ప్రశంసలు కురిపించారు.ఈ సినిమాని చూసి తమ స్పందనలు తెలియజేశారు. కాగా ఇటీవల విడుదలైన కన్నడ మూవీ కాంతారా మూవీ నార్త్ సౌత్ అనే తేడా లేకుండా కలెక్షన్లు రాబడుతూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా విడుదలై 25 రోజులు కావొస్తున్నా కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ‘కాంతారా’ మూవీని భారత ప్రధాని మోడీ వీక్షించనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు నవంబర్ 14న ప్రధాని మోదీ ‘కాంతారా’ దర్శకుడు కమ్ హీరో రిషబ్ శెట్టి కలిసి ప్రత్యేక స్క్రీనింగ్ లో తిలకించనున్నారు.బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న ‘కాంతారా’కు ఈ న్యూస్ మరింత బూస్ట్ ఇవ్వడం ఖాయం కన్పిస్తోంది. ఈ సినిమా చూశాక ప్రధాని మోడీ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement