Monday, May 6, 2024

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని

రంజాన్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వ‌హిస్తున్నారు. మసీదులు, మైదానాల్లో ముస్లిం సోద‌రులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈసంద‌ర్భంగా రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము, ఉపరాష్ట్రపతి జ‌గ‌దీప్ ధ‌న్క‌ర్, ప్రధాని న‌రేంద్ర మోడీ దేశ ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం సోదరులకు ఈద్ అల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ప్రేమ, కరుణ పండుగ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

ఇతరులకు సహాయం చేయాలనే సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. ఈద్ శుభ సందర్బంగా సమాజంలో సోదరభావాన్ని పెంపొందించేందుకు అందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దామని తెలిపారు. ముస్లీం సోదరులకు ప్రధాని మోడీ ఈద్ ముబారక్ తెలిపారు. మన సమాజంలో సామరస్యం, కరుణ, స్ఫూర్తిని పెంపొందించాలన్నారు. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement